18 ఏళ్లు పైబడిన వారికి covid వాక్సిన్ కొరకు 28 నుంచి నమోదు
👉దేశంలో 18 సం,, లు పైబడిన వారు కొవిడ్-19 టీకా తీసుకునేందుకు ఏప్రిల్ 28 నుంచి నమోదు ప్రక్రియ ప్రారంభం కానుంది.
👉ఆన్లైన్ పోర్టల్ ‘'కొవిన్’' లేదా ఆరోగ్య సేతు యాప్ ద్వారా పేరు నమోదు చేసుకోవచ్చని అధికారులు గురువారం తెలిపారు..
👉వ్యాక్సినేషన్ ప్రక్రియ మూడో దశలో భాగంగా మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన వారికి టీకాలు వేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే.
👉ఇందుకు అవసరమైన మార్పులు కొవిన్లో చేసినట్లు సంబంధిత అధికారులు తెలిపారు.
💥కొవిన్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ ఇలా..
💥కొవిన్ పోర్టల్ cowin.gov.in లోకి వెళ్లి ‘రిజిస్టర్/సైన్ఇన్ యువర్సెల్ఫ్’ను క్లిక్ చేయాలి...
👉తర్వాత మొబైల్ నంబర్ నమోదు చేస్తే OTP వస్తుంది. దీన్ని నమోదు చేసి, వెరిఫై బటన్ను క్లిక్ చేయాలి.
👉తర్వాత ‘Registration of Vaccination ’ పేజి ఓపెన్ అవుతుంది. ఇందులో అడిగిన వివరాలు (ఆధార్ కార్డు, పేరు, DOB ) నమోదు చేసి, రిజిస్టర్ బటన్పై క్లిక్ చేయాలి.
👉ఒకసారి రిజిస్ట్రేషన్ అయితే టీకా వేయించుకునేందుకు తేదీని ఎంచుకోవచ్చు. దానికోసం పక్కనే ఉన్న Shedule బటన్ను క్లిక్ చేయాలి..
👉Pincode నమోదు చేసి, వెతికితే దాని పరిధిలోని టీకా కేంద్రాల జాబితా కనిపిస్తుంది.
👉వాటి ఆధారంగా తేదీ, సమయాన్ని ఎంచుకొని ధ్రువీకరించాలి.
👉ఒక్క లాగిన్పై నలుగురికి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. తేదీలను మార్చుకొనే వెసులుబాటు కూడా ఉంది.
👇👇👇
Social Plugin