తెలంగాణ లో ఎల్లుండి నుంచి పాఠశాలలకు సెలవులు.
ప్రకటించిన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
G.O Copy:👇👇
👉తెలంగాణ లోని పాఠశాలు, జూనియర్ కళాశాలలకు రాష్ట్ర ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ఏప్రిల్ 27నుంచి మే 31 వరకు సెలవులు ఇస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు.
👉వేసవి సెలవుల నిర్ణయంపై సీఎస్, విద్యాశాఖ అధికారులతో సీఎం సమీక్షించినట్లు మంత్రి తెలిపారు.
👉కరోనా విస్తరించిన నేపథ్యంలో సీఎం ఆదేశాల మేరకు ఇప్పటికే పదో తరగతి పరీక్షలను రద్దు చేసి 5,21,392 మంది విద్యార్థులను పాస్ చేసినట్లు గుర్తు చేశారు.
👉1 నుంచి 9 తరగతులకు చెందిన 53.79లక్షల మంది విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేశామన్నారు. పాఠశాలలు, జూనియర్ కళాశాలలు తెరిచే విషయంపై జూన్ 1న ప్రభుత్వం నిర్ణయిస్తుందన్నారు.
👉ఏప్రిల్ 26ను ప్రస్తుత విద్యాసంవత్సరం చివరి పనిదినంగా పరిగణిస్తామని సబిత చెప్పారు.
🙏🙏🙏🙏🙏
Social Plugin