💥ప్లాస్మా థెరపీ అంటే ఏంటి?💥
రోగ నిరోధక వ్యవస్థ మెరుగ్గా ఉన్నవారిపై కోవిడ్-19 వైరస్
ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే, వారి
శరీరంలోకి వైరస్ ప్రవేశించగానే, వారిలోని రోగనిరోధక
కణాలు (తెల్ల రక్త కణాలు) దాడి చేసి ఆ వైరస్ను నాశనం
చేస్తాయి. అందుకే, కోవిడ్-19 నుంచి పూర్తిగా కోలుకున్న
వారి రక్తంలో రోగనిరోధక కణాల సంఖ్య బాగా వృద్ధి చెంది
ఉంటుంది.
అయితే, కొందరిలో రోగనిరోధక శక్తి చాలా బలహీనంగా
ఉంటుంది. అలాంటి వారిపై ఈ వైరస్ తీవ్ర ప్రభావం
చూపుతుంది. వారియొక్క శరీరంలో రోగనిరోధక
కణాలను పెంచగలిగితే వ్యాధిని ఎదుర్కొనే వీలుంటుంది.
అందుకు పరిష్కారంగా, కోవిడ్-19 నుంచి పూర్తిగా
కోలుకున్న వ్యక్తుల నుంచి ప్లాస్మాను సేకరించి, అదే
వైరస్తో బాధపడుతున్న మిగతా రోగుల శరీరంలోకి
ఎక్కిస్తారు. ఈ వైద్య విధానాన్నే ప్లాస్మా థెరపీ అంటారు.
💥ప్లాస్మాను ఎలా తీస్తారు?💥
ఎలాంటి సమస్య లేదని నిర్ధరించుకున్న తర్వాత, దాత
నుంచి ఆస్పెరిసిస్ అనే విధానం ద్వారా రక్తాన్ని
సేకరిస్తారు. ఈ సాంకేతిక విధానంలో రక్తం నుంచి ప్లాస్మా
లేదా ప్లేట్లెట్లను వేరు చేస్తారు. మిగతా రక్తం మళ్లీ దాత
శరీరంలోకి వెళ్లిపోతుంది.
Social Plugin